26 March, 2026 | 3:27 PM

Breaking News

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిరంతరం సరఫరా.. కొరత లేదన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌   •   మార్కాపురం బస్సు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు మృతి   •   మ‌ర్యాద ఇవ్వ‌డం లేదని అత్తమామలపై కక్ష.. ఏడేళ్ల చిన్నారిని చంపిన బావ   •   గొల్లపల్లి కొలనూరులో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక   •   గ్యాస్ కోసం రోడ్డెక్కిన క్యూ లైన్   •   ఆడపిల్లకు అన్యాయం... అడిగితే అక్రమ కేసులా..?   •   తాసిల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు   •   పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యత్వాల నమోదు ప్రారంభం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, పోలీస్ ఎస్‌హెచ్‌వోను నియమించాలి   •  

ఢిల్లీ ఫలితాలే రాష్టంలో రిపీట్..

08-02-2025 07:52 PM

బీజేపీ శ్రేణుల సంబరాలు..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పే రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిపీట్ అవుతుందని బీజేపి అదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు వేదవ్యాస్ పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి భారీ విజయం సాధించడం పట్ల ఆదిలాబాద్ లోని ఎమ్మెల్యే నివాసం ఎదుట ఆ పార్టీ శ్రేణులు శనివారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ మేరకు వేదవ్యాస్ మాట్లాడుతూ... ఆమ్ ఆద్మీ పార్టీ పాలనను ఢిల్లీ ప్రజలు తిరస్కరించారన్నారు. రానున్న కాలంలో బీజేపి మరిన్ని విజయాలు సాధిస్తుందన్నారు. అవినీతికి పాల్పడితే ఏ ప్రభుత్వానికైన ఇలాంటి గతే పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గందె కృష్ణ కుమార్, విజయ్ కుమార్, మురళీధర్, కృష్ణ యాదవ్, కరుణాకర్ రెడ్డి, సుభాష్, రవి, అర్జున్, రాము సందీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.