సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
26-03-2026 02:00 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని కాల్వపల్లితండాలో గల 5వ వార్డులో ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.5లక్షల నిధులతో చేపట్టిన సీసీరోడ్డు నిర్మాణ పనులను గురువారం సర్పంచ్ మాలోతు సక్రునాయక్ పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ మార్రెడ్డి సహకారంతో గ్రామంలో మౌలిక సదుపా యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బానోతు బాబునాయక్,వార్డు సభ్యులు మాలోతు చంటి నాయక్,స్వాతి లచ్చీరామ్,రమేష్ నాయక్,జుమ్మాబాయి సోమ్ల, చందర్ రావు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




