గొల్లపల్లి కొలనూరులో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక
26-03-2026 02:13 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని గొల్లపల్లి కొలనూరు గ్రామంలో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా మామిళ్ల ముత్యంరాజు, గౌరవాధ్యక్షులుగా బొజ్జం మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా ఏషా బక్కయ్య, ఖజానాదారుగా (క్యాషియర్) బొజ్జం బాల లింగం, ఉపాధ్యక్షులుగా ఏషా అంజయ్యను ఎన్నుకోగా, కార్యవర్గ సభ్యులుగా మామిళ్ల రాజయ్య, ఏషా మల్లేశం, నక్క మోహన్, మేక మల్లేశం, బొజ్జం ప్రసాద్ తదితరులు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులు నూతన కమిటీకి అభినందనలు తెలుపుతూ, గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.




