17 April, 2026 | 9:43 PM

Breaking News

అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •  

పని కల్పించండి మహాప్రభో...!

04-04-2025 05:21 PM

రోడ్డెక్కిన ఉపాధి హామీ కూలీలు

రాజంపేట గ్రామపంచాయతీలో జాబ్ కార్డులను విలీనం చేయాలని డిమాండ్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తమకు పని కల్పించాలని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కూలీలు శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గరిగెల పద్మ,పావని మాట్లాడుతూ మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా ఏర్పాటు కావడంతో జనకాపూర్, ఆసిఫాబాద్ గొడవల్లి, తారకరామ నగర్ బజార్ వాడి తదితర ప్రాంతాలకు చెందిన ఉపాధి హామీ కూలీలకు ఉపాధి కరువైందనీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రాంతాల కూలీలకు చెందిన జాబ్ కార్డులను రాజంపేట గ్రామపంచాయతీలో  విలీనం చేసి పనులు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.తమకు న్యాయం చేయకపోతే ఉధృతంగా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈనెల  5న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపడుతున్న విషయం తెలుసుకున్న సీఐ రవీందర్ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఉపాధి హామీ కూలీలకు నచ్చచెప్పడంతో నిరసన కార్యక్రమాన్ని విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు స్వరూప, కోశాధికారి మంజుల, సహాయ కార్యదర్శి సుగుణ, ఉపాధి హామీ కూలీలు, తదితరులు పాల్గొన్నారు.