పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసిన డీఈవో
12-07-2026 04:43 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో కేజీబీవీ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని అర్బన్ కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన పరీక్షలను జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న పరీక్షల నిర్వాకులు పరమేశ్వర్ ఎస్ఓ సుజాత ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేశారు. మెరిట్ మార్కుల ఆధారంగా కేజీబీవీ లో ప్రవేశాలు కల్పించినట్టు డీఈవో తెలిపారు.






