10 March, 2026 | 9:22 PM

ఏ అబేదా బసీర్, మస్జీద్ ఏ అలీ మస్జిద్ లను సందర్శించిన డిప్యూటీ మేయర్

10-03-2026 08:00 PM

మహబూబ్ నగర్ టౌన్: 11వ డివిజన్ బండమీదిపల్లి ప్రాంతంలోని పాలమూరు యూనివర్సిటీ సమీపంలోని  మస్జీద్ ఏ అబేదా బసీర్,మస్జీద్ ఏ అలీ మస్జిద్ లను మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మస్జిద్ లకు సంబంధించిన విద్యుత్, రోడ్లు, నీటి సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆ డివిజన్‌లోని ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వాటిని త్వరగా పరిష్కరించేలా అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మస్జీద్ పెద్దలు, మస్జీద్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు  ప్రజలు పాల్గొన్నారు.