23-01-2026 05:24:19 PM
పినపాక,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, జానంపేట గ్రామపంచాయతీ పరిధిలోగల, నర్సరీలో జరుగుతున్నట్టు పనులను శుక్రవారం జానంపేట గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ దాట్ల రాజేష్, పంచాయతీ కార్యదర్శి ఖాజా హుస్సేన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నర్సరీ పనులు వేగవంతం చేయాలని రానున్న వర్షాకాల సీజన్లో పంచాయతీ అధిక మొక్కలు నాటి పంచతి అభివృద్ధి చేయాలని నేటి మొక్కలు రేపటి వృక్షాలుగా ఎదిగి వాతావరణంలో కాలుష్యాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఈ ప్రేమ్, వార్డు సభ్యులు పొనుగోటి చందర్ రావు, కాంగ్రెస్ నాయకులు దందర నరేష్, పెనుపాక విజయక్రాంతి రిపోర్టర్ అత్తి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.