07-06-2025 07:34:59 PM
దేవరకొండ: చందంపేట మండలంలోని తేల్దేవారి పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ సీతారామ చంద్ర, శివాలయ, ఆంజనేయ స్వామి ధ్వజ స్తంభ, నాభిశిల, దేవాలయ విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకొని దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్(MLA Balu Naik) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ దేవరకొండ నియోజకవర్గ ప్రాంత ప్రజలపై ఉండి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.