07-06-2025 07:30:59 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం రాయపోల్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉనత పాఠశాల వద్ద చోటు చేసుకుంది.రాయపోల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బాలాజీ నగర్, హైదరాబాద్ కు చెందిన కిషోర్ రెడ్డి అతని స్నేహితుడు వాసు నాయక్ దౌల్తాబాద్ నుంచి గజ్వేల్ వైపు వెళుతుండగా మార్గమధ్యలో రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుర్గమ్మ గుడి మూలమలుపు వద్ద అతివేగంగా అజాగ్రత్తగా ద్విచక్ర వాహనం నడుపుకుంటూ చెట్టును బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కిషోర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.