07-06-2025 07:49:42 PM
నరేంద్ర స్వామి మహారాజ్..
స్వామీజీ పాద దర్శనం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే..
జుక్కల్ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని జుక్కల్ మండలంలోని దోస్తుపల్లి శివారులో గల నానీజ్ ధాం ఉప పీఠంలో శనివారం జరిగిన ప్రవచన కార్యక్రమంలో నరేంద్ర స్వామి మహారాజ్ అన్నారు. ముఖ్యంగా యువత చెడు అలవాట్లను మానివేసి హిందూ ధర్మంలో ఉన్న విలువలను కాపాడాలని సూచించారు. తమకు తాము సక్రమంగా బాధ్యతలు నిర్వహించుకుంటే దేశభక్తి మరింతగా పెరుగుతుందని ధర్మంపై నమ్మకం కూడా పెరుగుతుందన్నారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
తెలంగాణలోని మారుమూల మండలమైన జుక్కల్ లో ఉపపీఠం ఏర్పాటు చేయడానికి గల కారణాలను ఆయన వివరించారు. తమ ప్రధాన పీఠమైన నానీజ్ధాం భక్తులకు చాలా దూరంగా ఉందని, అందుకోసమే ఇక్కడ ఉప పీఠం నెలకొల్పడం జరిగిందన్నారు. ఇక్కడ ప్రతిరోజు పూజలు భజనలు జరుగుతాయి అన్నారు. రెండు నెలలకు ఒకసారి తాను రెండు రోజులపాటు ఇక్కడే ఉండి భక్తులకు దర్శనం ఇస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే ప్రవచనం విని ఆయన పాద దర్శనం చేసుకుని వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే వెంట బి ఆర్ ఎస్ నాయకులు రమేష్ రాజశేఖర్ గంగాధర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.