23-06-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల: జూన్ 22 (విజయక్రాంతి)బీఆర్ఎస్ హయంలో సిరిసిల్ల పట్టణం అభివృద్ధి జరిగిందని బిఆర్ఎస్ పట్టణ ధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు. ఆదివారం ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణం లోని కొండా లక్ష్మణ్ బాపూజి విగ్రహం ఏ ర్పాటులో తాను రూ.70 లక్షలు అవినీతికి పాల్పడినట్లు చేసిన ఆరోపణలను రుజువు చేయాలన్నారు. క్రీడా ప్రాంగణాలు పేరిట రూ.30 లక్షలు తీసుకున్నామని చేసిన ఆరోపణ తీవ్రంగా ఖండి స్తున్నామన్నారు.
సదరు ఆరోపణలపై అధికార పార్టీలో ఉన్న మీరు సంబంధిత ఎంబి రికార్డు తీసుకుని వస్తే గాంధీచౌక్ లో బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హ యాంలో కేటీఆర్ నాయకత్వంలో పట్టణంలో అభివృద్ధి జరిగిందని, ఏఎంసీ చైర్మన్ గా ఉన్న సమయంలో రూ. 25కోట్ల నిధులతో ఏఎంసి భవనం నిర్మించామన్నారు.
రైతు బజార్ సైతం తమ పాలనలోనే నిర్మించామని అన్నారు. గతంలో తమ పాలకవర్గం హయాంలో రూ.40కోట్ల పనులకు తాము టెండర్లు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెండింగ్లో పెట్టింరు. ఐదేండ్ల పాలనలో ఒక్క రూపాయి అవినీతికి.పాల్పడలే దన్నారు.
తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మ బోరని, మరోసారి వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరు కోమన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నా యకులు గాజుల బాలయ్య, పోచవేని ఎల్లయ్య, లింగంపల్లి సత్యనారాయణ,దార్ల సందీప్, అన్నారం శ్రీనివాస్, మ్యాన రవి,మామిడాల కృష్ణ,దూస రాజేశ,తదితరులు పాల్గొన్నారు.