calender_icon.png 28 June, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుజాతనగర్ మండలంలో అభివృద్ధి పనుల మహోత్సవం

28-06-2025 12:00:00 AM

  1. రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన కూనంనేని

రూ.1.87 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఎమ్మెల్యే కూనంనేని

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 27 (విజయక్రాంతి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలో అభివృద్ధి పనుల మహోత్సవం శుక్రవారం హాట్టహాసంగా జరిగింది. స్థానిక శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ఎనిమిది పంచాయతీల పరిధిలో పూర్తయిన 18 అభివృద్ధి పను లను ప్రారంభించారు. మరో 14 అభివృద్ధి పనులకు ఒక్కరోజే శంకుస్థాపన చేశారు.

సర్వారం, కోయగూడెం, బేతంపూడి, జామ్లా తండా, పాత అంజనాపురం, కొత్త అంజనా పురం, నర్సింహా సాగర్, సింగభూపాలెం పంచాయతీల పరిధిలో పరిధిలో రూ.1.30 కోట్లతో పూర్తయిన రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులను ప్రారంభించారు. మరో రూ.1.87కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వివిధ గ్రామా ల్లో జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంబోచ్చవ సభల్లో కూనంనేని మాట్లాడారు.

గ్రామీణ ప్రాంతాల్లో సుదీర్ఘకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో వాటి పరిస్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే 70 శాతం మేర గ్రామీణ ప్రధాన రహదారులు, అంతర్గత రహాదారులు పూర్తిచేశామన్నారు. ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక అవసరాలైన త్రాగునీరు, విద్యుత్, వైద్య సౌకర్యం వంటి వాటికి ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు.

త్రాగునీటి సమస్య పరిస్కారంకోసం మూడు ప్రాంతాల్లో రూ.1.38కోట్లతో నిర్మించనున్న సంపు, పంపు హౌస్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశామని, మరో రూ.30 లక్షలతో పైపు లైన్ల నిర్మాణం, పునర్నిర్మాణం చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు, పిఏసిఎస్ చైర్మన్ మండే మనుమంతరావు, తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపిడివో భారతి తదితరులు పాల్గొన్నారు.