calender_icon.png 20 June, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

20-06-2025 05:40:08 PM

మంథని మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల తనిఖీలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష..

మంథని (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sri Harsha) అన్నారు. శుక్రవారం మంథని మండలంలోని పలు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంథని మండలంలోని ఎక్లాస్ పూర్ గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మంథనిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బాలికలు, జే.బి.ఎస్ (జూనియర్ బాయ్స్ స్కూల్)లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పిల్లలకు కనీస విద్యా ప్రమాణాలు అందేవిధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి బోధన చేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలకు వచ్చే పిల్లలందరికీ పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలని అన్నారు. పిల్లల హాజరు రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని, మంథనిలో ఉన్న బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జే.బి.ఎస్ (జూనియర్ బాయ్స్ స్కూల్) లో కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, టాయిలెట్స్ వంటి పనులు నెలన్నర రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఏఈ పీఆర్ అనుదీప్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.