20-06-2025 05:37:12 PM
మందమర్రి (విజయక్రాంతి): అనారోగ్యంతో మృతిచెందిన నిరుపేద మహిళ దహన సంస్కారాలకు మేముసైతం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. మున్సిపల్ పరిధిలోని ఆర్కే-1 సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన సుజాత అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మృతి చెందింది. దహన సంస్కారాలను నిర్వహించలేని నిరుపేద కుటుంబం కావడం, స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మేముసైతం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు బూబత్తుల శ్రీనివాస్ విరాళాలు సేకరించి వచ్చిన 5000 రూపాయలు శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మేరుగు తిరుపతి, ఈర్లపాటి సోమయ్య, గోపతి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.