calender_icon.png 20 June, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి అంటే రోడ్లు, డ్రైనేజీ నిర్మించడం కాదు..

20-06-2025 05:48:14 PM

ప్రభుత్వ, ప్రవేట్ సమాంతరంగా అభివృద్ధి చెందాలి..

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి...

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): అభివృద్ధి చేయడం అంటే కేవలం గల్లీలో రోడ్లు వేసి డ్రైనేజీలు నిర్మించడం కాదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. మహబూబ్ నగర్ నగరపాలక పరిధిలోని తిరుమల హిల్స్ లో ప్రతిభ విద్యాసంస్థలు వారి మహంతి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy)తో కలిసి హాజరు అయ్యారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మన మహబూబ్ నగర్ కు ఎలాంటి వనరులు లేవని మనకు ఉన్న ఏకైక వనరులు మన జ్ఞానమే అని చెప్పారు. ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పం మాకే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందన్నారు.

అందుకే మన మహబూబ్ నగర్ కు ఐఐఐటి కళాశాలను బహుమతిగా ఇచ్చారన్నారు. మహబూబ్ నగర్ ను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపాలనే ఆలోచన ఎమ్మెల్యే లకే కాదు సామాన్య పౌరుడికీ ఉండాలని స్పష్టం చేశారు. అకుంఠిత దీక్షతో పనిచేస్తే ఏదైనా సాధ్యమే అని ఆయన చెప్పారు. మన ఆలోచనల్లో మార్పు రావాలన్నారు.  మన మహబూబ్ నగర్ పిల్లలు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ సాధించాలని ఆయన ఆకాంక్షించారు. చదువుతో పాటు కళలు, సాహిత్యం, క్రీడలలలో మన మహబూబ్ నగర్ పిల్లలు రాణించాలని ఆయన అన్నారు.

ప్రతిభా జూనియర్ కళాశాల విద్యార్థిని మంజుశ్రీ నీట్ ఎంట్రెన్స్ నందు ఆల్ ఇండియాలో 1902 ర్యాంకు సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ఐఎన్టీయుసి రాములు యాదవ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జాజి మొగ్గ నర్సింహులు, మహతి పాఠశాల చైర్మన్ మంజుల దేవి, డైరెక్టర్లు  వేంకటేశ్వర రెడ్డి, జనార్ధన్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.