15 March, 2026 | 6:26 PM

Breaking News

మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •  

గాంధీలో నర్సింగ్ విద్యార్థినుల ధర్నా

08-11-2024 12:00 AM

హాస్టల్‌లో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని డిమాండ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (విజయక్రాంతి): నర్సింగ్ విద్యార్థినులు తమ హాస్టల్‌లో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ భవనం ఎదుట ధర్నా చేపట్టారు. గాంధీ దవాఖానలో ఉండే నర్సింగ్ కళాశాల హాస్టల్‌ను కోవిడ్ సమయంలో సమీపంలోని బోయిగూడకు మార్చారు.

అయితే, హాస్టల్‌లో మురుగు సమస్య భరించలేకుండా ఉందని విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. దీంతో విద్యార్థినుల ధర్నాపై స్పందించిన గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి.. బోయిగూడ హాస్టల్‌లో డ్రైనేజీ సమస్యను పరిష్కరించే వరకూ గాంధీ దవాఖానలోని 8వ అంతస్తులో తాత్కాలికంగా ఉండాలని సూచించడంతో ధర్నాను విరమించారు.