17 June, 2026 | 11:36 AM

Breaking News

SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •  

కౌలు రైతుల కోసం 4న ధర్నా

01-12-2024 01:31 AM

రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు

ముషీరాబాద్, నవంబర్ 30 : రాష్ట్రంలో కౌలు రైతుల ను గుర్తించి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ముఖ్య రైతు, వ్యవసాయ కార్మి క, కౌలు రైతు సంఘాల సమావేశం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా కమిటీ అధ్యక్షుడు విస్సా కిరణ్(రైతు స్వరాజ్య వేదిక) మాట్లాడుతూ. .డిసెంబర్ 4న సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద కౌలు రైతులతో కలిసి ప్రజా దర్బార్, ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులంతా అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సాగర్ (తెలంగాణ రైతుసంఘం), ప్రభులింగం (రాష్ట్ర కౌలు రైతుల సంఘం) పాల్గొన్నారు.