11 March, 2026 | 2:49 PM

Breaking News

మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •   ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు   •  

దివ్యాంగులు అన్ని రంగాల్లో సత్తా చాటాలి

05-12-2024 12:29 AM

మేయర్ గద్వాల విజయలక్ష్మి 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (విజయక్రాంతి): దివ్యాంగులు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతూ, ఉన్నతంగా ఎదగాలని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకాంక్షిం చారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంతో పాటు ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా బుధవారం జూబ్లీహిల్స్ సీఎంటీఐ ట్రైనింగ్ సెంటర్ ఆవరణలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో  కలిసి ఆమె దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు.

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభు త్వం కట్టుబడి ఉంద న్నారు. దివ్యాంగులు తమ కాళ్ల మీద తాము జీవించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. మనోధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఏ విషయం లోనూ నిరుత్సాహ పడవద్దన్నారు. ఎక్కడా వెనుకంజ వేయకుండా స్ఫూర్తి, పోటీతత్వంతో తమ వైకల్యాన్ని అధిగమించి అనుకున్నది సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, ఆర్పీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.