23 June, 2026 | 10:24 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

బండ పడింది!

08-04-2025 01:35 AM

వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 50 వడ్డన

  1. ‘ఉజ్వల’ లబ్ధిదారులకూ వర్తింపు.. నేటినుంచే అమలు
  2. పెట్రోల్, డీజిల్‌పై సుంకం పెంపు.. భారం చమురు కంపెనీలదే

సిలిండర్ రకం   పాత ధర కొత్త ధర

సాధారణ             రూ.803 రూ.853 

ఉజ్వల              రూ.503 రూ.553

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కేంద్రం షాక్‌నిచ్చింది. వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచు తూ సోమవారం కేంద్రం నిర్ణయం తీసుకుంది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ను గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు పెంచలేదని, తాజాగా రూ.50 చొప్పున పెంచుతున్నట్టు కేంద్ర పెట్రోలియం, సహాయ వాయువులశాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి సోమవారం ప్రకటించారు.

ధరల పెంపు ఉజ్వల పథకం లబ్ధిదారులకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. పెరిగిన ధరలు మంగళవారం నుంచే (ఏప్రిల్ 8) నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ధరల పెంపుతో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.803 నుంచి రూ.853కు, ఉజ్వల పథకం కింద సిలిండర్ ధర రూ.503 నుంచి రూ.553కు పెరగనున్నదని వెల్లడించారు.

మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్ గ్యాస్ ధర గతవారంలో రూ.41 మేర తగ్గిందని తెలిపారు. ఇకపై సిలిండర్ ధరలపై కేంద్రం 15 రోజులు లేదా నెలకోసారి సమీక్షిస్తుందని వివరించారు.

సిలిండర్ ధరలపై పెంపుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో స్పందిస్తూ.. ‘దోపీడీ, మోసం అనే పదాలకు పర్యాయ పదం మోదీ ప్రభుత్వం.. ఉజ్వల సిలిండర్‌ను వినియోగించే నిరుపేదలను సైతం కేంద్ర ప్రభుత్వం వదలడం లేదు. వారిపైనా ద్రవ్యోల్బన కొరడా ఝుళిపించడం దారుణం’ అని అన్నారు.

పెట్రోల్, డీజిల్‌పై రూ.2 ఎక్సైజ్ సుంకం పెంపు..

పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.2 చొప్పున ఎక్సైజ్ సుంకం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పెంచిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే.. ఈ భారం వాహనదారులపై పడదని, సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని తేల్చిచెప్పింది.