23 June, 2026 | 11:39 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

నన్ను జైల్లో వేస్తారేమో..

08-04-2025 01:32 AM

టీచర్లకు అన్యాయం  జరగనివ్వను: మమత 

కోల్‌కతా, ఏప్రిల్ 7: టీచర్లకు మద్దతుగా నిలిచి పోరాడుతున్నందుకు తనను జైల్లో వేస్తారేమో అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇటీవల సుప్రీం తీర్పుతో ఉద్యోగా లు కోల్పోయిన టీచర్లతో సోమవా రం కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో దీదీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మేము ఆ తీర్పును ఒప్పుకున్నట్టు అనుకోకండి.

మేము బండరాళ్లం కాదు.. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను జైలులో పెట్టే అవకాశం కూడా ఉంది. కానీ అవేమీ నేను పట్టించుకోను. అర్హులు ఉద్యోగాలు కోల్పోవడాన్ని నేను భరించలేను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకూ కొలువులు కాపాడుతాను’ అని పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేస్తున్న 25,753 మందిని సుప్రీం కోర్టు అనర్హులుగా ప్రకటించింది. కొంత మం ది దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ తొలగింపు నుంచి సుప్రీంకోర్టు మినహాయింపునిచ్చింది. గతంలో హైకోర్టు కూడా ఇలాంటి తీర్పునే వెలువరించింది.