18-06-2025 08:12:55 PM
ఎంఈఓ ప్రభుదయాళ్..
కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రతను పాటించేలా చెట్లను సంరక్షించేలా, ప్రత్యేక కార్మికులను ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో వీరు పని చేస్తారు. స్వచ్ఛ మిత్రగా పేర్కొన్న వీరికి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మండల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం ప్రత్యేక నూతన దుస్తులను కొత్తగూడెం ఎంఈఓ డాక్టర్. ప్రభుదయాల్(MEO Dr. Prabhu Dayal) అందజేశారు.