18-06-2025 08:10:51 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy) బుధవారం వివిధ కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు పట్టణంలోని బంగల్ పేట్ కాలనీలోని రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులను ఆదేశించి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పట్టణంలోని పలు కాలనీలోని రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.