11 May, 2026 | 8:43 PM

Breaking News

విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి   •   ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబర్చిన శివానికి సీఎం చేతుల మీదుగా ల్యాప్‌టాప్ ప్రదానం   •   కాసిపేట గనిని సందర్శించిన జీఎం రాధాకృష్ణ   •   ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి: ఆర్డిఓ సుబ్రహ్మణ్యం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – సేంద్రియ సాగుతోనే భవిష్యత్‌   •   అంబార్‌పేట్‌లో ఘనంగా శివగంగల కళ్యాణం   •   రేగులగుంటలో ఘనంగా నాభిశిల ప్రతిష్ట   •   ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి   •   ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలి   •  

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పుస్తకాల పంపిణీ : జిఎం షాలెం రాజు

11-05-2026 07:41 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): రుద్రంపూర్ సిఈఆర్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన స్టడీ రూమ్‌లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన పుస్తకాల పంపిణీ జిఎం చేతుల మీదుగా జరిగింది. అనంతరం జీఎం  మాట్లాడుతూ, అభ్యర్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, పట్టుదల మరియు నిరంతర శ్రమతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ  యువత అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు.

పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల్లో, చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు, అవసరమైన అధ్యయన వాతావరణాన్ని కల్పించేందుకు, ఇటువంటి స్టడీ రూమ్‌లు , పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు అభిప్రాయపడ్డారు. 

ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల  అభివృద్ధి కోసం పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో, కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు ,తీసుకున్న ప్రత్యేక చొరవను యూనియన్ నాయకులు కొనియాడారు. అభ్యర్థులకు  అధ్యయన వాతావరణం కల్పిస్తూ వారి భవిష్యత్తు పురోగతికి, సింగరేణి యాజమాన్యం అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం  షాలెం రాజు తో పాటు, ఎస్‌ఓ టు జీఎం ,కోటి రెడ్డి , ఏరియా సేఫ్టీ ఆఫీసర్ , ముక్కపాటి వెంకటేశ్వర్లు, పర్సనల్ మేనేజర్ , తిరుపతి , (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి శ్రీ వి. మల్లికార్జున రావు , (ఐఎన్‌టీయూసీ) వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎం.డి. రజాక్ , (ఐఎన్‌టీయూసీ) పిట్ కార్యదర్శి సాగర్  ఇతర అధికారులు, అభ్యర్థులు పాల్గొన్నారు.