calender_icon.png 4 June, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలకు వంట సామగ్రి పంపిణీ

24-04-2025 12:16:18 AM

బిజినేపల్లి ఏప్రిల్ 23 : ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంట చేసేందుకు అవసరమైన సామాగ్రిని బుధవారం ఎంఈవో కార్యాలయంలో తహసీల్దార్ శ్రీరాములు, ఎంపీడీఓతో కలిసి పం పిణీ చేసినట్లు ఎంఈవో రఘునాథ్ శర్మ తెలిపారు. గ్రామాల్లోని ప్రాథమిక, ప్రాథమి కోన్నత, ఉన్నత పాఠశాల్లోని విద్యార్థుల సం ఖ్య ఆధారంగా సామాగ్రిని ప్రభుత్వం విడతల వారీగా అందజేసినట్లు తెలిపారు.

ఆ యా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సా మాగ్రిని అందజేసి సంబంధిత వంట ఏజేన్సీల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన వంటను వడ్డించాలని సూచించారు. అన్ని పాఠశాలలకు కలిపి 186 పెద్ద గిన్నెలు, 131 బేసన్లు, 232 స్టీల్ బాక్సులు, 125 స్టీల్ బకెట్స్, 209 స్పూన్లు, 46 చొప్పున సాంబారు గంట్టెలు, కూర గంట్టెలు, కప్ గీరులు ప్రభుత్వం సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో ప్రధానో కృష్ణ, బాస్కర్ రెడ్డి, ప్రభాకర్, పీఈటీ సరిత, సీఆర్పీలు మల్లేష్, శేఖర్, సాంబశివుడు, రామస్వామి, ప్రభాకర్, మిద్దె బాలయ్య, రంజిత్, తిరుపతి తదిత రులు ఉన్నారు.