9 April, 2026 | 6:51 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ

12-02-2026 12:21 AM

సిద్దిపేట రూరల్, ఫిబ్రవరి 11: సిద్దిపేట రూరల్ మండలం రావురుకుల జెడ్పీ హెచ్ ఎస్ పాఠశాలలో డాక్టర్ బండి శ్రీకాంత్ తన తండ్రి జ్ఞాపకార్థంగా విద్యార్థులకు పరీక్ష సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బట్టు తిరుపతి మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చది వి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు తీసుకురావాలని కోరారు.

ప్రతి సంవత్సరం పరీక్ష సామగ్రిని అం దించడమే కాకుండా గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్న బండి శ్రీకాంత్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బండి గోదావరి, సాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కవిత రవీందర్ , కొమ్ము రవీందర్, తదితరులు పాల్గొన్నారు.