07-02-2026 08:54:20 PM
భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో ఉప సర్పంచ్ గౌరిగారి కార్తిక్ రెడ్డి పదవ తరగతి విద్యార్థులకు శనివారం పరీక్ష సామగ్రిని అందజేశారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జన్మదినం సందర్భంగా, అలాగే విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని విద్యార్థుల భవిష్యత్తుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని గ్రామస్తులు పేర్కొంటూ ఉప సర్పంచ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.