07-02-2026 08:57:37 PM
రాష్ట్ర అధ్యక్షులు వోడ్నాల రాజశేఖర్
పాపన్నపేట: సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపీఎస్ విధానం అమలు చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, పిఆర్సి కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని, పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలని, టెట్ రద్దు అంశాన్ని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తామని, జిపిఎఫ్ వెంటనే వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు వోడ్నాల రాజశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఆర్థికపరమైన అంశాలు నెరవేర్చకపోతే రాష్ట్ర రాజధానిలో ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.