ఎల్ఓసీ పత్రాల పంపిణీ
04-04-2026 04:55 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పట్టణాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధిదారులకు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి రావు శనివారం ఎల్బోసి పత్రాలను అందజేశారు. మొత్తం 119 మందికి రూ 44 లక్షల విలువచేసే పత్రాలు అందించడం జరిగిందన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు




