calender_icon.png 9 June, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30 వరకు రేషన్ బియ్యం పంపిణీ

09-06-2025 01:41:38 AM

కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి జూన్ 8 ( విజయ క్రాంతి ): ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ నెల నుండి మూడు మాసాలకు సంబంధించిన రేషన్ కోటాను  ఈ నెల 30 వ తేది వరకు ఒకేసారి పంపిణీ చేయడం జరుగుతుందని,ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని యాదాద్రి భువనగిరి జిల్లా  కలెక్టర్ హనుమంత రావు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. 

జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబం ధించిన బియ్యం కోటాను రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డులు కలిగిన వారు ఒకేసారి పొందవచ్చని అన్నారు. రేషన్ కార్డులు కలిగిన వారు ఎలాంటి  ఆందోళన చెందవద్దని తెలిపారు. ఎలాంటి అపోహ లకు గురి కావద్దని  ఈనెల 30 వరకు చౌక ధరల దుకాణ డీలర్లు మూడు మసాల కోటాను  రేషన్ కార్డు కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.