31-05-2025 07:46:46 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థిని విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాలను ఆయా పాఠశాలలకు ఎంఈఓ సుంకోజు భాస్కర్(MEO Sunkoju Bhaskar) ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ భాస్కర్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని అందులో భాగంగానే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోలేపాక నాగేందర్, పిఈటి ఎక్కలదేవి మల్లేశం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.