calender_icon.png 2 June, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

31-05-2025 07:35:53 PM

ఎమ్మార్వో దిలీప్ కుమార్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో జూన్ 3 నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ దిలీప్ కుమార్(Tehsildar Dilip Kumar) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ఆర్ చట్టంను ఉద్దేశించి ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. మండల రెవెన్యూ అధికారులు రెండు టీములుగా ప్రతిరోజు రెండు గ్రామాల చొప్పున ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారన్నారు.

మొదటి టీంకు తహసీల్దార్ దిలీప్ కుమార్, రెండవ టీంకు డిప్యూటీ తహసీల్దార్ శ్రావణి టీం లీడర్లుగా వ్యవహరిస్తారని అన్నారు. ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సులు ఉంటాయని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులలో ఇది వరకు దరఖాస్తు చేసిన భూ భారతిలో, ఆన్లైన్లో పెండింగ్ ఉన్నవాళ్లు కాకుండా మిగితా వాళ్లు, కొత్త పట్టదారు పాసుబుక్ రానివాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, రైతులు భూభారతి సమస్యలను రాతపూర్వకంగా కమిటీలకు తెలియజేయాలని సూచించారు.