31-05-2025 07:48:20 PM
వలిగొండ (విజయక్రాంతి): ప్రతి ఉద్యోగికి చేసిన సేవతోనే గుర్తింపు లభిస్తుందని మత్స్యగిరి గుట్ట చైర్మన్ కుమార్ రెడ్డి నరేష్ రెడ్డి, ఈవో సల్వాద్రి మోహన్ బాబు అన్నారు. శనివారం వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామం పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జాడ అంజయ్య ఆఫీస్ సబార్డినేట్గా 35 సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందించి పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అంజయ్య చేసిన సేవలను పలువురు ప్రశంసించారు. అనంతరం ఆయన శాలువాలతో మెమెంటులతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తలు, కుటుంబ సభ్యులు, అర్చక,సిబ్బంది, బంధు మిత్రులు పాల్గొన్నారు.