04-06-2025 07:39:20 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని నర్సాపూర్ మండలంలో బూరుపల్లి గొల్లమాడ ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) బుధవారం పరిశీలించారు. పాఠశాలకు వెళ్లి అక్కడ ఉన్న తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వ్యవస్థపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆగిపోయిన భవన నిర్మాణం పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ మండల అధికారులు సిబ్బంది ఉన్నారు.