06-08-2025 01:21:26 AM
కరీంనగర్, ఆగస్టు 5 (విజయ క్రాంతి): కరీంనగర్ లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ విభాగాన్ని, మాత శిశు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం సందర్శిం చారు. ఇక్కడ అందుతున్న వైద్య సేవలను, పలు సౌకర్యాలను పరిశీలించారు. క్రిటికల్ కేర్ విభాగంలోని ఐసియు, వార్డులు, ఆపరేషన్ థియేటర్ ఇతర బ్లాక్ లను సందర్శించారు.
ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రిటికల్ కేర్ విభాగం నిర్వహణకు అవసరమైన ఆక్సిజన్ లైన్ సమకూర్చుకోవాలని, అవసరమున్న ఇతర సౌకర్యాలు, మరిన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశిం చారు. అన్ని రకాల సేవలను మరింత విస్తృతం చేసేందుకు వైద్యులను, ఇతర సిబ్బందిని సర్దుబాటు తీసుకోవాలని అన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం ఓపి విభాగం, స్కానింగ్ గదిని ప రిశీలించారు.
గర్భిణీలతో మాట్లాడి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గర్భిణీ కి టీఫా పరీక్ష తప్పనిసరి అని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని గ ర్భిణీలకు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ నవీనా,పాల్గొన్నారు.