20 March, 2026 | 4:33 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తిపై సస్పెన్షన్ వేటు

11-07-2024 02:19 AM

రంగారెడ్డి, జూలై 10 (విజయక్రాంతి): జిల్లా మత్స శాఖ అధికారి సుకీర్తి సస్పెన్షన్‌కు గురయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు మత్ససహకార సంఘం సొసైటీ నిధులను తన వ్యక్తిగతానికి వాడుకున్నారని.. ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజం అని తేలడంతో జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తిని సస్పెండ్ చేసూ..్త రాష్ట్ర ఫిషరీస్ డైరెక్టర్ డా.ప్రియాంక అలా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సుకీర్తి.. గతంలో సొసైటీ లీజుకు సంబంధించిన రూ.62,547 నిధులు తన వ్యక్తిగతానికి వాడుకున్నారని, ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఆమె నిధులు వసూలుకు పాల్పడినట్లు సొసైటీ సభ్యులు ఇటీవల రాష్ట్ర డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు సుకీర్తిపై వచ్చిన ఆరోపణలు నిజం అని తేలడంతో ఆమెను సస్పెండ్ చేసినట్లు సమాచారం.