07-06-2025 05:52:48 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఈరోజు బక్రీద్ పండుగ(Eid al-Adha) సందర్భంగా జిల్లా ఎస్పీ జి జానకి షర్మిల ఐపిఎస్(District SP G Janaki Sharmila IPS) జిల్లాలోని పలు ప్రాంతాల్లో శాంతి భద్రతలను దగ్గరుండి పర్యవేక్షించారు. ముఖ్యంగా భైంసా పట్టణంలోని ఈద్గాలను మసీదులను సందర్శించి శాంతి భద్రతల విషయంలో ఏ మాత్రము లోటు పాట్లు లేకుండా చూసుకున్నారు. చిన్నారులను, మత పెద్దలలను కలిసి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంతటా ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకున్నారు. ట్రాఫిక్, పలు అంశాల గురించి పోలీస్ అధికారులకు క్షుణ్ణంగా ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఏఎస్పి రాజేశ్ మీన ఐపిఎస్, భైంసా ఏఎస్పి అవినాష్ కుమార్ ఐపిఎస్, ఇన్స్పెక్టర్ లు ప్రవీణ్ కుమార్, క్రిష్ణ, గోవర్ధన్, గోపీనాథ్, డి.ఎస్.బి ఇస్పెక్టర్ సమ్మయ్య, ఆర్ ఐ.రామ్ నిరంజన్, ఎస్.ఐ లు, ఆర్.ఎస్.ఐ లు, డాగ్ స్క్వాడ్ బృందం ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.