07-06-2025 05:43:11 PM
నిర్మల్ (విజయక్రాంతి): దిలావర్ పూర్ మండలం కాల్వ గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ(Sri Lakshmi Narasimha Swamy Temple) పాలకవర్గం శనివారం డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు(DCC President Srihari Rao)ను జిల్లా కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. చైర్మన్ మహేందర్, ధర్మకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి శనివారం భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తారని వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని నూతన పాలకవర్గానికి సూచించారు.