31-05-2025 05:26:56 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఎనలేని సేవలందించి శనివారం పదవీ విరమణ పొందిన ఇద్దరు ఎస్ఐలు, ముగ్గురు ఏఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(District SP Rohit Raju) హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా సత్కరించారు. కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సెల్వ రాజు, కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న మస్తాన్ రావు, అశ్వారావుపేట పేట పోలీస్ స్టేషన్ నందు ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్లు, కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ఎస్తేరు రాణి, బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న నారాయణరావు, చంద్రుగొండ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న మధుసూదన్ రావులు పదవి విరమణ పొందారు.
పదవి విరమణ పొందిన ఈ ఆరుగురు అధికారులను జిల్లా ఎస్పీ శాలువాలతో, పూలమాలతో సత్కరించారు. అనంతరం పోలీస్ శాఖలో వీరి అనుభవాలను జిల్లా ఎస్పీతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు తమ శేషజీవితాన్ని కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. సుమారు 40 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలందించిన అధికారుల అనుభవాలను నూతనంగా పోలీస్ శాఖలో భర్తీ అయిన అధికారులు సిబ్బంది స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.
పోలీసు శాఖ నుండి పదవీ విరమణ పొందిన అధికారులు ,సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.తమ దైనందిన కార్యక్రమాలలో వ్యాయామం,యోగా,ధ్యానం వంటి వాటిని అనుసరిస్తూ తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.అనంతరం పదవీ విరమణ పొందిన ఆరుగురు అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి,ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,అభడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు మరియు జిల్లా పోలీస్ అధికారుల సంఘం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.