09-06-2025 10:20:10 PM
పాపన్నపేట: మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్(District SP Srinivas) కుటుంబ సమేతంగా శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది శ్యామ్ రాజ్, సాయిబాబా పాపన్నపేట్ పోలీస్ సిబ్బంది, కొల్చారం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు సినీ పరిశ్రమ సీనియర్ నటుడు నరేష్ సైతం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.