calender_icon.png 25 June, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య సిబ్బందితో డీఎమ్ హెచ్ఓ సమీక్ష సమావేశం

24-06-2025 08:31:26 PM

గద్వాల టౌన్: మంగళవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ల యందు ఎంఎల్ హెచ్పి వైద్య సిబ్బది సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ కే.సిద్ధప్ప(District Medical and Health Officer Dr. SK Siddappa) మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు సమయపాలన పాటించాలని ఆరోగ్య కార్యక్రమాలను చూసుకోవాలని మధ్యాహ్నం నుండి గ్రామాలకు వెళ్లి పర్యవేక్షణ చేయాలని ప్రతిరోజు జరిగే ఓపి ఆరోగ్య కార్యక్రమాలను, ఆరోగ్య శివిర్ యాక్టివిటీస్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పోర్టల్ నందు అప్లోడ్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జె సంధ్య కిరణమై, డాక్టర్ ప్రసూనారాణి, డాక్టర్ జి రాజు,డాక్టర్ రిజ్వానా తన్వీర్,మెడికల్ ఆఫీసర్లు,67 సెంటర్ ల ఏంఎల్ హెచ్పి సిబ్బంది సంబంధిత ఏఎన్ఎంలు, ప్రోగ్రాం ఆఫీసర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.