20-06-2025 12:00:00 AM
కొత్తపల్లి, జూన్ 19 (విజయ క్రాంతి): కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ సందర్శించారు. హాజరుపట్టికను, అవుట్ పేషెంట్ రిజిస్టరు లను ఇతర రికార్డులను వెరిఫై చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిశుభ్రతను పరిశీలించి అన్ని వేళల క్లీన్ గా ఉంచుకోవాలనీ సూచించారు.
ఎన్ సి డి క్లినిక్ లో అసంక్రమిత వ్యాధుల రిజిస్టర్లైన రెడ్ పుస్తకము, బ్లూ పుస్తకము లను పరిశీలించి అందులో అధిక రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తుల వివరాల నమోదును పరిశీలించి వారికి మందులు ఇస్తున్న తీరును పరిశీలించారు.
ఫార్మసీ స్టోర్స్ లో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందుల నిల్వలను పరిశీలించారు. మొదటి కాన్పులను సిజేరియన్ చేయించుకోవడం వల్ల కలిగే సమస్యలను వివరించి సాధారణ డెలివరీల కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జరిగేటట్లుగా గర్భవతులను, వారి కుటుంబ సభ్యులను ప్రోత్సహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో పిఓఎంహెచ్ఎన్ డాక్టర్ సన జ వేరియా, కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నజియా, డిపిఓ ఎన్ హెచ్ ఎం స్వామి, సాగర్, ఏ ఎం ఎస్ డాక్టర్లు, సంబంధిత వైద్య సిబ్బందిపాల్గొన్నారు.