15 June, 2026 | 1:52 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

సర్వేపై ఎలాంటి అపోహలు వద్దు

06-11-2024 04:21 PM

చేవెళ్ల (విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేతో రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు పోతాయని ప్రజల్లో అపోహలు ఉన్నాయని, అలాంటిది ఏమి ఉండదని ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ఈ సర్వే చేపడుతున్నామని వెల్లడించారు. బుధవారం శంకర్పల్లిలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వేలో ప్రతి 150 ఇండ్లకు ఒక ఎన్యుమరేటర్ను నియమించామని చెప్పారు. ఈ సర్వే ఆధారంగా అన్ని వర్గాల అభివృద్దికి ప్రణాళికలు రూపొందించి ముందుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీమ్ భరత్, కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.