24 March, 2026 | 5:02 AM

సెల్ టవర్ ఏర్పాటు చేయొద్దు

24-03-2026 12:18 AM

ఆందోళన చేసిన నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామస్తులు 

బూర్గంపాడు, మార్చి23(విజయక్రాంతి): తమ గ్రామంలో సెల్ టవర్ నిర్మించొద్దంటూ బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామస్తులు సోమవారం ఆందోళన చేపట్టారు. అంగన్వాడి కేంద్రానికి ఆనుకొని ఇళ్ళ మధ్యలో సెల్ టవర్ నిర్మించడంతో చిన్నారుల ఆరోగ్యం దెబ్బతింటుందని అనేక ఆరోగ్య సమస్యలతో పాటు రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ అనుమతి లేకుండా గ్రామంలో ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ జనావాసాల మధ్య చేపట్టిన సెల్ టవర్ నిర్మాణాన్ని తక్షణం ఆపాలని స్థానిక సర్పంచ్ బానోత్ సరోజ డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నిర్మాణంపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.