31-05-2025 01:25:14 AM
సీఐ సూర్యప్రకాష్, గూడూరు మండల కేంద్రంలో విత్తన దుకాణాలను పరిశీలన
గూడూరు. మే 30: (విజయక్రాంతి)ఎవరైనా అనుమతి లేని విత్తనాలను రైతులకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని రైతులు విత్తన డీలర్ల దగ్గర తీసుకునే విత్తనాలకు తప్పకుండా బిల్ తీసుకోవాలని గూడూరు తాసిల్దార్ నాగ భవాని సీఐ సూర్య ప్రకాష్ లు సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పలు ఎరువుల విత్తన దుకాణాలను మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ అబ్దుల్ మాలిక్ ఎస్ఐ గిరిధర్ రెడ్డి తో పాటు తాసిల్దార్ నాగ భవాని సీఐ సూర్య ప్రకాష్ లు పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ రైతులు డీలర్ల దగ్గర విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రసీదును పొందాలని అది పంట కాలం పూర్తయ్యే వరకు రైతులు భద్రపరుచుకోవాలని సూచించారు గ్రామాల్లో ఎవరైనా అనుమతి లేకుండా విత్తనాలు అమ్మినట్లు కనిపిస్తే వెంటనే సమాచారం వ్యవసాయ శాఖ అధికారులకు చేరవేయాలని ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
జెన్టిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ లేని ఈ హెచ్ టి పత్తి పెద్ద ఎత్తున వాడటం వలన వాతావరణ కాలుష్యం పెరిగి జీవవైవిద్యం ఏర్పడుతుందని ప్రతి ఒక్క డీలరు విత్తన నియంత్రణ చట్టం 1983 ప్రకారం బిల్ బుక్ స్టాక్ రిజిస్టర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీలర్లు తదితరులు పాల్గొన్నారు.