calender_icon.png 1 June, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించొద్దు

31-05-2025 01:26:32 AM

పనులు త్వరగా పూర్తి చేయాలి: ఎంపీ బలరాం నాయక్ 

మహబూబాబాద్, మే 30 (విజయక్రాంతి): మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ రైల్వే అధికారులకు కోరారు. శుక్ర వారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను ఎంపీ పరిశీలించారు.

స్టేషన్ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన వివిధ పనుల జాప్యం వల్ల ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రయాణికులు ఎంపీకి వివరించారు. ఈ విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తో ఎంపీ ఫోన్లో మాట్లాడి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయించి, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.