17 April, 2026 | 9:36 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

పాక్ ఓటీటీ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేయొద్దు

09-05-2025 12:53 AM

భారత్ మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యం లో పాక్ మూలాలున్న ఓటీటీ కంటెంట్‌ను పూర్తిగా నిలిపివేయాలని భారత సమాచార ప్రసార మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఓటీటీ ఫ్లాట్‌ఫాంలకు సూచనలు సైతం జారీచేస్తూ ప్రకటనను సైతం విడుదల చేసింది.

జాతీయ భద్రత దృష్ట్యా పాకిస్థాన్ మూలాలున్న ఓటీటీ కంటెంట్, వేదికలు, మీడియా స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంలు, మధ్యవర్తిత్వం ద్వారా అఏ్య ఏ ప్రసారమైనా ఇక పూర్తిగా నిలిపివేస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది. పాకిస్థాన్ వెబ్‌సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు సహా మీడియా కంటెంట్ ఏదీ ఇక భారత్‌లో అందుబాటులో ఉండదని, సబ్‌స్క్రిప్షన్, సహా ఇతర మార్గాల ద్వారా కంటెంట్ పొందుతున్న వారికీ ఇందులో ఏ మినహాయింపూ లేదని స్పష్టం చేసింది.