21-06-2025 11:22:04 PM
చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి..
చేగుంట (విజయక్రాంతి): 11వ ప్రపంచ యోగ దినోత్సవాన్ని(International Yoga Day) పురస్కరించుకొని చేగుంటలోని శ్రీ శుభమస్తు ఫంక్షన్ హాల్ లో జరిగిన యోగ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి(SI Chaitanya Kumar Reddy), ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ... ప్రతిరోజు, ప్రతి ఒక్కరు, కచ్చితంగా యోగాను అభ్యసించాలని, ఆయన కోరారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల మనిషిలోని 600 కండరాలు, 206 ఎముకలు, 72,000 నాడులతో పాటు, మానవ శరీరంలోని ప్రతి అవయవం ఉత్తేజం పొంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి వీలు ఉంటదని ఆయన అన్నారు.
ప్రతి క్రీడకు కూడా మూలం యోగానే అని ఆయన అన్నారు. చిన్నప్పటి నుంచి యోగా చేయడం అలవాటు చేసుకునీ ఆచరిస్తే ఏ రోగాలు దరి చేరవని, అలాగే మనతో పాటు, మన ఇంట్లోని కుటుంబ సభ్యులందరితో యోగా చేసినట్టు చూడాలని, దాని ద్వారా సంపూర్ణ ఆరోగ్యమైన కుటుంబం, తయారవ్వడమే కాకుండా మంచి వాతావరణం ఏర్పడుతుందని ఆయన అన్నారు. అనంతరం మెదక్ జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కర్ణం గణేష్ రవికుమార్, మాట్లాడుతూ... యోగాకు ఆద్యుడు, పరమశివుడని, తరువాత మునులు, మహర్jషులు, దీనినీ ఆచరించే వారిని ఐదువేల సంవత్సరాల పూర్వం పతంజలి మహర్షి యోగాను ప్రపంచానికి అందించారని దానిలో భాగంగానే అష్టాంగ యోగానీ రచించాడని, దానిని ఎనిమిది భాగాలుగా చేసి, యమ, నియమ, ఆసన, ప్రత్యహర,ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధి నియమాలను, ఆచరించి ఇప్పుడున్న,మనకు అందించారని, అలాగే ఇప్పుడున్న కాలుష్య ప్రపంచంలో ప్రతిదీ కలుషితమైందని పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, ఇలా అన్నీ కలసితమైనవి కాబట్టి కచ్చితంగా ప్రతిరోజు యోగాతో పాటు ప్రాణాయామం, షట్క్రీయలు, ముద్రలు, చేయాలని ఆయన కోరారు.
వీటిని రోజు ఆచరించడం వల్ల ఇప్పుడు వస్తున్న రోగాలు అయినటువంటి బిపి, షుగర్, క్యాన్సర్,నడుమునొప్పి, మోకాళ్ళ నొప్పి, తలనొప్పి ,అజీర్తి,హస్తమా, లాంటి అనేక రోగాలకు యోగా దివ్య ఔషధమని ఆయన అన్నారు. మిగతా క్రీడల్లో కాకుండా యోగాకు పెద్దగా గ్రౌండ్ గాని, వస్తువులు గాని, అవసరం ఉండవని,మూడు గజాల అడ్డం, ఆరు గజాల పొడవు స్థలం ఉండి, గాలి, వెలుతురు, ఉన్న చోట సూర్యోదయం,వెలుగులో సాయంత్రం, సూర్యస్తమ సమయం,లో యోగ చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుందని, ఇప్పుడు యోగాను స్పోర్ట్స్ కోటాలో, చేర్చడం వల్ల ఉద్యోగ, ఉపాధి, ఉన్నత చదువులకు రెండు శాతం స్పోర్ట్స్ కోట కింద పనిచేస్తుందని ఆయన అన్నారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో,మెదక్ జిల్లా 27 సార్లు ఓవరాల్ ఛాంపియన్షిప్ గా నిలిచిందని,అలాగే ఇప్పుడున్న క్రీడాకారులు, ప్రతినిత్యం,చేగుంటలోని,శ్రీ కార్తవీర్యా,యోగాశ్రమంలో, ఉదయం,ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల,వరకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, దీనిని యోగ సాధకులు అందరూ సద్వినియోగం చేసుకొని,మళ్లీ మెదక్ జిల్లాకు పూర్వవైభవం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎస్సై శ్రీ చైతన్యకుమార్ రెడ్డి, మండల విద్యాధికారి నీరజ, ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతి,జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ పీడీ శారద, మనోహర్, చాట్ల సంతోష్ ,పెంట గౌడ్,ప్రశాంత్, శ్రీనివాస్, భూపాల్ రెడ్డి, వంజరి రమేష్ ,రాములు, శంకర్, వెంకటేష్,సుభాష్, కటిక రమేష్,శేఖర్,ఆర్,ఎస్,ఎస్ వెంకటేష్, శివ, శ్రీ కృష్ణవేణి,రిషి,జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినిలు,విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.