6 May, 2026 | 2:21 PM

Breaking News

సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కట్ల రవీందర్   •   TVK పార్టీకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్.. INDIA కూటమి భవితవ్యం అయోమయం   •   మన్నె క్రిశాంక్‌కు హైకోర్టులో ఊరట.. బెయిల్ మంజూరు   •   ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్   •   దమ్మపేటలో ఈ నెల 11న హిందూ ధర్మ నమ్మేళనం   •   కొత్తూరులో రైతుల రాస్తారోకో   •   పెంచిన గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ కొరతపై సీపీఐ ఆందోళన   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న రాజ్యసభ ఎంపీ వేం నరేంధర్ రెడ్డి   •   పోలీస్ కమిషనర్ కు తప్పని వేధింపులు   •   ఉత్కూర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ రాస్తారోకో   •  

మీరాబాయి మెరిసేనా?

07-08-2024 03:51 AM
  1. నేడు వెయిట్ లిఫ్టింగ్ పోటీలు 
  2. గోల్ఫ్ బరిలో దీక్షా, అదితి

పారిస్: భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సికోమ్ నేడు మహిళల 49 కేజీల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి రజతం గెలిచిన మీరాబాయిపై ఈసారి కూడా మంచి అంచనాలున్నాయి. కచ్చితంగా పతకం రంగు మారుస్తుందని అంతా ఆశిస్తున్నారు. 12 మంది బరిలోకి దిగనుండగా.. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో అత్యధిక బరువు ఎత్తిన టాప్ ఆటగాళ్లను విజేతలుగా నిర్ణయించనున్నారు.

ఇక మహిళల గోల్ఫ్ విభాగంలో అదితి అశోక్, దీక్షా డాగర్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో అదితి తృటిలో పతకం చేజార్చుకుంది. ఆ పొరపాటును పునరావృతం చేయకూడదనే పట్టుదలతో ఉంది. మరోవైపు కారు ప్రమాదం నుంచి బయటపడిన దీక్షా ఈసారి పతకం సాధించాలనే పట్టుదలతో ఉంది.