05-06-2025 12:35:25 AM
ఘట్ కేసర్, జూన్ 4 (విజయక్రాంతి) : ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి రైల్వే స్టేషన్, బస్టాండ్, దేవాలయం, మసీద్ , ఆర్టీసీ బ స్టాండ్ మరియు అత్యధిక జన సమూహం కలిగిన షాపింగ్ మాల్స్ , మార్ట్ లు తదితర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ మరియు బాంబ్ స్క్వాడ్ లతో బుధవారం తనిఖీలు జరిపిన ట్లు సీఐ పందిరి పరశురామ్ తెలిపారు.
రాచకొండ కమీషనర్ జి. సుధీర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రతి చోట క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పరిశీలించినట్లు సీఐ పరశురాం పేర్కొన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని మరి యు ప్రజలకు భద్రత కల్పించేందుకు రాచకొండ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నామనీతెలిపారు.