28-12-2025 01:25:43 PM
కాల్వ శ్రీరాంపూర్,(విజయక్రాంతి): పెరిక సంఘం పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా కాల్వశ్రీరాంపూర్ మండలం మోట్లపల్లి గ్రామానికి చెందిన యువకుడు దొమ్మటి రాజు నియమితులు అయ్యారని, రాష్ట్ర సంఘం అధ్యక్షులు యర్రం శెట్టి ముత్తయ్య రాజును నియమిస్తూ నేడు 28తేదిన ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో పెరిక కులస్తులు ఎదురుకుంటున్న సమస్యల పై అభివృద్ధిపై నిరంతరం స్పందిస్తూ కుల బాంధవుల సంక్షేమం కోసం జిల్లా కమిటీతో కలిసి చురుకుగా పని చేయాలని ముత్తయ్య సూచించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించినందుకు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు లక్కరుసు ప్రభాకర్ వర్మ కు, రాష్ట్ర అధ్యక్షులు ఎర్రం శెట్టి ముత్తయ్యకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రే సురేందర్ కు జిల్లా అధ్యక్షులు గోవిందుల ఆనంద్ కు జిల్లా ఉపాధ్యక్షులు అల్లం తిరుపతికి రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు.